పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి

  • అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

 

 

పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ హాల్లో బుధవారం జరిగిన బార్ అసోసియేషన్ నూతన ఎగ్జిక్యూటివ్ కమిటీ 2025 – 2026 సంవత్సరానికి నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పిడుగురాళ్ళ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షులుగా కమదన కుమారస్వామి, ఉపాధ్యక్షులుగా పి.భవాని వియస్, ప్రధాన కార్యదర్శిగా  కోపూరి వెంకటేశ్వర్లు, జాయింట్ సెక్రటరీగా పి.మాణిక్యం, ట్రెజరర్ గా ఎం.లోకేశ్వరి. లైబ్రేరియన్ గా ఎస్.వి.కోటేశ్వరరావు, లేడీస్ రిప్రజెంటేటివ్ గా పి.నవ్యలను ఈ సమావేశంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ ఎన్నికల ప్రక్రియను బార్ అసోసియేషన్ సీనియర్ అడ్వకేట్. డి.చెన్నయ్య నిర్వహించారు. ఈ సందర్బంగా నూతనంగా ఎన్నికయిన ఎగ్జిక్యూటివ్ కమిటీకి సీనియర్ అడ్వకేట్. రెడ్డి సాంబశివరావు, న్యాయవాదులు, పుర ప్రముఖులు పట్టణ వ్యాపారస్థులు శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in