సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూసివేత

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా టిటిడి స్థానిక ఆలయాల మూసివేత

 

అక్షర ఉదయమ్ – తిరుపతి

 

సెప్టెంబర్ 7న చంద్రగ్రహణం కారణంగా ఆదివారం మధ్యాహ్నం నుండి టిటిడి స్థానిక ఆల‌యాలైన తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయం, తిరుపతి శ్రీ గోవిందరాజ స్వామి వారి ఆలయం, శ్రీ కోదండరామ స్వామివారి ఆలయం, శ్రీనివాస మంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయం, అప్ప‌లాయిగుంట శ్రీ ప్ర‌స‌న్న వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆల‌యాల త‌లుపులు మూసివేస్తారు.

సెప్టెంబర్ 7వ తేదీ ఆదివారం రాత్రి 9.50 గంటల నుండి 8వ తేదీ సోమవారం వేకువ జాము 1.31 గంటల వరకు చంద్ర‌గ్రహణం ఉంటుంది. గ్రహణ సమయానికి 6 గంటలు ముందుగా ఆలయం తలుపులు మూసివేయడం ఆనవాయితీగా వస్తోంది.

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయం

తిరుచానూరు శ్రీ పద్మావతీ అమ్మవారి ఆలయాన్ని 7వ తేదీ ఆదివారం మధ్యాహ్నం 02.15 గంటల నుండి మూసివేస్తారు. 8వ తేదీ సోమవారం ఉదయం 4.00 గంటలకు ఆలయాన్ని తెరిచి శుద్ధి, పుణ్య వచనం చేస్తారు. ఉదయం 8 గంటల నుండి భక్తులను సర్వదర్శనానికి అనుమతిస్తారు.

శ్రీ గోవిందరాజు స్వామి ఆలయం

శ్రీ గోవిందరాజ స్వామి ఆలయంలో 7వ తేదీ మద్యాహ్నం 1.30 గంటల నుండి 3 గంటల వరకు

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in