త్వరలోనే అక్రెడిటేషన్ల జీవో – మంత్రి కొలుసు పార్థసారథి హామీ
- మంత్రితో ఏపీయుడబ్ల్యుజే భేటీ అక్షర ఉదయమ్ - విజయవాడ: అక్రెడిటేషన్ల జీవోపై కసరత్తు పూర్తయ్యిందని, త్వరలోనే జీవో విడుదల చేసి సకాలంలోనే అక్రెడిటేషన్లు మంజూరు చేస్తామని సమాచార పౌర సంబంధాలు, గృహ నిర్మాణ శాఖా మంత్రి కొలుసు పార్థసారథి హామీ ఇచ్చారు. బుధవారం రాష్ట్ర సచివాలయంలో తనను కలిసిన ఏపీయుడబ్ల్యుజే ప్రతినిధి బృందానికి మంత్రి ఆ మేరకు హామీ ఇచ్చారు. మంత్రిని కలిసిన బృందంలో ఏపీయుడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు ఐ.వి.సుబ్బారావు, ఐజేయూ జాతీయ కార్యదర్శి డి.సోమసుందర్, యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు...