12 మంది సీఎంలపై క్రిమినల్ కేసులు
- తెలంగాణా సీఎం రేవంత్రెడ్డిపై 89 కేసులు
- తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్పై 47.. ఏపీ సీఎం చంద్రబాబుపై 19 కేసులు
- ఎన్నికల అఫిడవిట్ల ఆధారంగా వెల్లడించిన ఏడీఆర్

అక్షర ఉదయమ్ – న్యూఢిల్లీ
దేశంలోని 30 మంది ముఖ్యమంత్రుల్లో 12 మంది తమపై క్రిమినల్ కేసులు ఉన్నాయని ప్రకటించారు.
దీనికి సంబంధించి అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రీఫామ్స్ (ఏడీఆర్) సంస్థ వెల్లడించింది. తనపై 89 కేసులు ఉన్నాయని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. తమిళనాడు సీఎం స్టాలిన్ తనపై 47 కేసులు ఉన్నాయని తెలపగా, ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు తనపై 19 కేసులు ఉన్నాయని ప్రకటించారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తనపై 13 కేసులు ఉన్నాయని తెలపగా, తనపై 5 కేసులు ఉన్నాయని జార్ఖండ్ సీఎం హేమంత్ సొరేన్ ప్రకటించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ పై 4, హిమాచల్ ప్రదేశ్ సుఖ్వీందర్ సింగ్పై 4, కేరళ సీఎం పినరయి విజయన్పై 2, పంజాబ్ సీఎం భగవంత్ మాన్పై ఒక క్రిమినల్ కేసు ఉన్నట్లు ప్రకటించారు. కనీసం 10 మంది సీఎంలు తమపై హత్యాయత్నం, కిడ్నాపింగ్, లంచాలకు సంబంధించిన అత్యంత తీవ్రమైన నేర ఆరోపణలు ఉన్నట్లు ప్రకటించారు. కనీసం ఐదేళ్ల శిక్ష పడే కేసుల్లో అరెస్టై 30 రోజులు నిర్బంధంలో ఉంటే 31వ రోజు ప్రధానినైనా, ముఖ్యమంత్రినైనా, మంత్రులనైనా పదవుల్లోంచి తొలగించే బిల్లును కేంద్రం తీసుకొచ్చిన నేపథ్యంలో ఈ కేసుల వివరాలు బయటకు రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఎన్నికల సందర్భంగా ఆయా ముఖ్యమంత్రులు ప్రకటించిన అఫిడవిట్ల ఆధారంగా ఏడీఆర్ ఈ వివరాలు సేకరించింది.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..