SLBC టన్నెల్ ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి
అక్షర ఉదయమ్ - శ్రీశైలం తెలంగాణ శ్రీశైలంలోని SLBC టన్నెల్లో చోటు చేసుకున్న ఘోర ప్రమాదంలో ఎనిమిది మంది సజీవ సమాధి అయ్యారు. మృతుల్లో ఆరుగురు కార్మికులు, ఇద్దరు ఇంజనీర్లు ఉన్నారు. ప్రమాదం జరిగినప్పటి నుంచే అధికారులు, రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగి క్షతగాత్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు. మట్టిలో వారు మూడు మీటర్ల లోతులో కూరుకుపోయినట్లు అధునాతన పరికరాల ద్వారా తెలుసుకున్న రెస్క్యూ అధికారులు.