చిలకలూరిపేట బైపాస్పై ఘోర రోడ్డు ప్రమాదం
- నలుగురు అక్కడికక్కడే మృతి
అక్షర ఉదయమ్ – చిలకలూరిపేట
గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట బైపాస్ రోడ్డుపై గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ట్రాక్టర్ల లోడ్తో వెళ్తున్న కంటైనర్ లారీని వెనుక నుంచి షిఫ్ట్ కారు వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఆరుగురిలో నలుగురు స్పాట్లోనే మృతి చెందగా, ఇద్దరిని తీవ్ర గాయాలతో సమీప ఆసుపత్రికి తరలించారు.
సమాచారం మేరకు గుంటూరు నుండి ఒంగోలు వైపు వెళ్తున్న షిఫ్ట్ కారు బైపాస్ రోడ్డులో వేగంగా దూసుకెళ్తూ, అకస్మాత్తుగా ఎదురైన కంటైనర్ను తప్పించుకోలేక బలంగా ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. తీవ్రమైన ప్రభావంతో కారు పూర్తిగా ధ్వంసమైందని, మృతి చెందిన వారిని గుర్తించే పనులు కొనసాగుతున్నాయని అధికారులు చెప్పారు.
గాయపడిన వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు వెల్లడించారు. ఘటనాస్థలికి చిలకలూరిపేట పోలీసులు చేరుకొని కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.