తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం

తిరుపతి రైల్వే స్టేషన్ లో రైలులో అగ్నిప్రమాదం

 

అక్షర ఉదయమ్ – తిరుపతి

 

తిరుపతి రైల్వే స్టేషన్ లో ఆగి ఉన్న రైలులో అగ్ని ప్రమాదం జరిగింది. తిరుపతి రైల్వే యార్డులోని హిసార్ ఎక్సప్రెస్ లో మంటలు చెలరేగి బోగీ పూర్తిగా దగ్ధమైంది. రాజస్థాన్ లోని హిసార్ నుంచి హిసార్ ఎక్సప్రెస్ తిరుపతి రైల్వేస్టేషన్ కు ఉదయం 11.50కి చేరుకుంది. ప్రయాణికులను రైల్వే స్టేషన్ లో దించేసిన తర్వాత యార్డులోకి వెళ్తున్న క్రమంలో ఇంజిన్ వెనకవైపు ఉన్న బోగీలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అదే సమయంలో పక్క ట్రాక్ పై ఉన్న రాయలసీమ ఎక్సప్రెస్ లోని జనరేటర్ బోగీకి మంటలు వ్యాపించాయి. ఫైర్ ఇంజిన్ వచ్చి మంటలు ఆర్పివేసేలోగా హిసార్ ఎక్సప్రెస్ బోగీ పూర్తిగా దగ్ధమైంది. రాయలసీమ ఎక్సప్రెస్ లోని జనరేటర్ బోగీ పాక్షికంగా దెబ్బతింది. ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఆర్పీఎఫ్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in