గుంటూరులో ఘనంగా పతాక దినోత్సవం

అక్షర ఉదయమ్ – గుంటూరు
సాయుధ దళాల పతాక దినోత్సవాన్ని గుంటూరు జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా ఘనంగా ప్రారంభించారు. సైనికుల త్యాగాలు వెలకట్టలేనివని, వారికి ప్రతి ఒక్కరూ అండగా నిలవాలని ఆమె పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా జిల్లాలో ఇప్పటివరకు రూ.17,67,363 పతాక నిధులు సేకరించగా, రాష్ట్రంలో గుంటూరు జిల్లా అగ్రస్థానంలో నిలిచింది. డి.ఆర్.డి.ఏ., మెప్మా, వి.ఐ.టి., ఎస్.ఆర్.ఎం. విశ్వవిద్యాలయాలు, కోస్టల్ బ్యాంక్ వంటి సంస్థలు అధిక మొత్తం విరాళాలు అందించాయి.
సైనికుల సంక్షేమ సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ప్రజలు ఆన్లైన్ ద్వారా లేదా జిల్లా సైనిక సంక్షేమ కార్యాలయం ద్వారా విరాళాలు అందించవచ్చని జిల్లా సైనిక సంక్షేమ అధికారి గుణశీల తెలిపారు.
ఉత్తరాఖండ్లో విధుల్లో వీరమరణం పొందిన కిషోర్ భార్య చిట్టుమడుగుల నవీనకు 300 గజాల స్థలాన్ని జిల్లా కలెక్టర్ అందజేశారు. మాజీ సైనికుల సమస్యలపై సైనిక సంక్షేమ సంఘం వినతి పత్రం సమర్పించింది.

ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ, ఇతర అధికారులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.