అక్షర ఉదయమ్
Date of Publish : 14 February 2025, 12:29 pm Posted by : అక్షర ఉదయమ్

స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ

స్థానిక ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగింపుపై గెజిట్ జారీ ఇద్దరి కంటే ఎక్కువ పిల్లలు ఉంటే పంచాయతీ ఎన్నికల్లో పోటీకి అనర్హులన్న నిబంధనను పంచాయతీరాజ్ చట్టం నుంచి తొలగిస్తూ తీసుకున్న నిర్ణయంపై న్యాయశాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. నవంబరులో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లో సవరణ బిల్లును సభ్యులు ఏకగ్రీవంగా ఆమోదించిన విషయం తెలిసిందే. దానికి గవర్నర్ ఆమోదం కూడా లభించడంతో తాజాగా గెజిట్ విడుదల చేశారు.