అక్షర ఉదయమ్
Date of Publish : 02 February 2025, 12:24 pm Posted by : అక్షర ఉదయమ్

దేహదారుడ్య పరీక్షల్లో 11 మంది ఉత్తీర్ణత

అక్షర ఉదయమ్ – గుంటూరు

గుంటూరు పోలీసు పెరేడ్ గ్రౌండ్స్ లో కానిస్టేబుల్ అభ్యర్థులకు శనివారం దేహదారుడ్య పరీక్షలు జరిగాయి. మొత్తం 40 మంది అభ్యర్ధులు హాజరవ్వగా ఏడుగురు సరైన ధృవపత్రాలు సమర్పించక వెనుదిరిగారు. వివిధ విభాగాల్లో మరింత మంది విఫలం చెందగా చివరికి 11 మంది మాత్రమే ఉత్తీర్ణత సాధించారు. అదనపు ఎస్పీలు జీవీ రమణ, హనుమంతు, ఏఆర్ డీఎస్పీ ఏడుకొండలు తదితరులు పరీక్షలను పరిశీలించారు.