అక్షర ఉదయమ్
Date of Publish : 08 May 2025, 4:07 pm Posted by : అక్షర ఉదయమ్

భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం

భారత్ లోని 15 నగరాల్లో దాడులకు పాక్ యత్నం

భారత్ లోని 15 నగరాల్లోని మిలటరీ స్థావరాలపై పాకిస్థాన్ దాడులు చేసేందుకు ప్రయత్నించి విఫలమైనట్లు జాతీయ మీడియా పేర్కొంది. చైనాకు చెందిన BVR మిస్సైల్స్ తో దాడులు చేసేందుకు యత్నించగా, భారత్లోని S400 ఎయిర్ డిఫెన్స్ వ్యవస్థ సమర్థంగా అడ్డుకుంది. జమ్మూ, శ్రీనగర్, అమృత్ సర్, పఠాన్ కోట్, బటిండా, లుధియానా, జలంధర్, చండీగఢ్, అవంతిపుర, భుజ్, ఫలోడి పాటు పలు నగరాలపై దాడులకు పాక్ యత్నించింది.