దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతిరోజాకు పవన్ కళ్యాణ్ అభినందనలు

దేశవ్యాప్తంగా ఆధ్యాత్మిక యాత్ర చేస్తున్న స్వాతిరోజాకు పవన్ కళ్యాణ్ అభినందనలు

 

అక్షర ఉదయమ్ – మంగళగిరి

 

దేశవ్యాప్తంగా బైక్‌పై ఒంటరిగా ప్రయాణిస్తూ ఆధ్యాత్మిక సందేశాలను ప్రజలతో పంచుకుంటున్న జెన్ Z ట్రావెల్ వ్లాగర్ స్వాతి రోజాను రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సోమవారం అభినందించారు.

 

మంగళగిరిలోని క్యాంప్ కార్యాలయంలో పవన్ కళ్యాణ్‌ని స్వాతి రోజా మర్యాదపూర్వకంగా కలిశారు. స్వాతి రోజా సాగిస్తున్న సాహసయాత్ర గురించి వివరాలు అడిగి తెలుసుకున్న ఉప ముఖ్యమంత్రి, భవిష్యత్ పర్యటనలు విజయవంతం కావాలని ఆకాంక్షించారు.

ఇటీవల దేశవ్యాప్త యాత్రలో భాగంగా శ్రీశైలాన్ని దర్శించిన సమయంలో స్వాతి రోజాకు వసతి, భద్రత సమస్యలు ఎదురైన విషయం తెలిసిన పవన్ కళ్యాణ్ వెంటనే స్పందించి శ్రీశైలం, తిరుమల, శ్రీకాళహస్తి, విజయవాడ కనకదుర్గ ఆలయాల్లో స్వాతి రోజాకు ప్రత్యేక దర్శనల ఏర్పాట్లు చేశారు.

 

దుర్గగుడి దర్శన అనంతరం డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్‌ని స్వాతి రోజా కలసి ధన్యవాదాలు తెలియజేశారు. ఈ సందర్భంగా యాత్రలో ఎదురైన అనుభవాలను పంచుకుంటూ, బైక్ రైడింగ్‌పై తనకున్న ఆసక్తిని పవన్ కళ్యాణ్‌తో చర్చించారు. పవన్ కూడా బైకులపై మక్కువను ఆసక్తిగా వివరించారు.