రాష్ట్రపతి భవన్‌లో చారిత్రాత్మక వివాహం

అక్షర ఉదయమ్ - ఢిల్లీ   - చరిత్రలో తొలిసారి రాష్ట్రపతి భవన్‌లో చారిత్రాత్మక వివాహం జరగనుంది. తొలిసారిగా రాష్ట్రపతి భవన్‌లో మహిళా ఉద్యోగి పెళ్లి జరగనుంది. రాష్ట్రపతి వ్యక్తిగత భద్రతా అధికారి (పీఎస్‌ఓ)గా పని చేస్తున్న మహిళా ఉద్యోగి వివాహానికి రాష్ట్రపతి భవన్‌లో శరవేగంగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమానికి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము స్వయంగా ప్రత్యేక అనుమతిని మంజూరు చేశారు.   ఈ నెల 12న రాష్ట్రపతి భవన్‌లోని మదర్‌ థెరిసా క్రౌన్‌ కాంప్లెక్స్‌లో వివాహం జరగనుంది. వధువు పేరు పూర్ణిమా...