ఇవాళ్టి నుంచి ఏపీలో స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ

వచ్చే నెల 15 వరకు 4 విడతల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ.. 9 జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ కార్యక్రమం.
ఈరోజు శ్రీకాకుళం, విజయనగరం, విశాఖ, కృష్ణా, ఎన్టీఆర్, తిరుపతి, నెల్లూరు, ఉభయ గోదావరి జిల్లాల్లో స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ.
జిల్లాల్లో కార్డులు పంపిణీ చేయనున్న మంత్రులు, ఎమ్మెల్యేలు.. కార్డుదారుల ఇంటింటికెళ్లి స్మార్ట్ రైస్ కార్డులు అందజేయనున్న సిబ్బంది.
విజయవాడలో జరగనున్న కార్యక్రమంలో పాల్గొననున్న పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్.. 15 రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 1.45 కోట్ల కుటుంబాలకు స్మార్ట్ రైస్ కార్డుల పంపిణీ.
కొత్తగా దరఖాస్తు చేసుకున్న 6.70 లక్షల కార్డుదారులకు స్మార్ట్ రైస్ కార్డుల జారీ.. క్యూఆర్ కోడ్ సహా పలు సాంకేతిక అంశాలతో స్మార్ట్ రైస్ కార్డుల తయారీ.
స్మార్ట్ రైస్ కార్డుతో స్కాన్ చేసి బయోమెట్రిక్, ఐరిస్ గుర్తింపుతో సరుకుల పంపిణీ.. సరుకుల పంపిణీ సమాచారం ఎప్పటికప్పుడు కేంద్ర సర్వర్కు చేరవేసేలా ఏర్పాటు.
రేషన్ సరుకుల పంపిణీలో అక్రమాలు నిలువరించడమే లక్ష్యంగా నూతన వ్యవస్థ.. రాష్ట్రంలో ఎక్కడి నుంచైనా రేషన్ తీసుకునే సదుపాయం కల్పించిన ప్రభుత్వం.

– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..