అక్షర ఉదయమ్
Date of Publish : 02 February 2025, 1:08 pm Posted by : అక్షర ఉదయమ్

పౌర సరఫరాల గోదామును సబ్ కలెక్టర్ తనిఖీ

అక్షర ఉదయమ్ – ఆదోని

 

ఆదోని పట్టణంలోని స్థానిక పౌర సరఫరాల గోదామును శనివారం సబ్ కలెక్టర్ మౌర్య భదర్వాజ్ తనిఖీ చేశారు. అనంతరం వారు మాట్లాడారు. రేషన్ నిల్వలు, భద్రత తదితర అంశాలను సమీక్షించిన ఆయన, లబ్ధిదారులకు బియ్యం పంపిణీలో పొరపాట్లు చోటు చేసుకోకుండా చూడాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తనిఖీలో పౌర సరఫరాల డీటీ వలిభాష, రవీంద్ర, రెవెన్యూ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.