సూపర్ స్టార్ రజనీకాంత్ ఒడిలో కూర్చున్న ఈ పిల్లవాడు తమిళనాడులో నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం అయ్యాడు

మహ్మద్ యాసిన్ అనే బాలుడికి రోడ్డుపై 50 వేల రూపాయలు దొరికాయి. అతను నేరుగా పోలీసు స్టేషన్కు వెళ్లి ఆ డబ్బును పోలీసు అధికారికి ఇచ్చి నాకు ఈ డబ్బు రోడ్డుపై దొరికింది. దీని యజమాని ఎవరో కనుక్కొని, దానిని తిరిగి వారికి ఇవ్వండి” అని అన్నాడు
దానికి పోలీసు అధికారి ఆ పిల్లవాడిని ఈ డబ్బును నువ్వు ఎందుకు ఉంచు కోలేదని అడిగాడు.
దానికి యాసిన్ ఈ డబ్బు ఎవరో కష్టపడి సంపాదించిన డబ్బు.. నాది కాదని, దానిని నా దగ్గర ఎలా ఉంచుకోగలనని బదులిచ్చాడు.
అతని నిజాయితీని మెచ్చిన పోలీసు అధికారి, నీకు నీకు ఏదైనా కోరిక ఉంటే చెప్పమని యాసిన్ ను అడిగాడు.
వెంటనే యాసిన్ నాకు సూపర్ స్టార్ రజనీకాంత్ను కలవాలనే కోరిక ఉందని చెప్పాడు. వెంటనే పోలీసులు ఈ విషయాన్ని సూపర్ స్టార్ రజనీకాంత్ కు తెలియజేయగా.. అందుకు స్పందించిన రజనీకాంత్ యాసిన్ ను తన వద్దకు తీసుకు రమ్మని తెలిపారు.
ఈ సందర్బంగా రజనీకాంత్ ఆ పిల్లవాడి తల్లిదండ్రులకు ఈ పిల్లవాడి చదువు ఖర్చులన్నింటినీ తాను భరిస్తానని వాగ్దానం చేశారు.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..