కాల్పుల్లో ఇద్దరు దొంగలు గాయపడ్డారు: హైదరాబాద్ సీపీ సజ్జనార్
అక్షర ఉదయమ్ – హైదరాబాద్
చాదర్ఘాట్ కాల్పుల ఘటనలో ఇద్దరు దొంగలు గాయపడ్డారని హైదరాబాద్ సీపీ సజ్జనార్ (Sajjanar) తెలిపారు. ఘటనా స్థలిని పరిశీలించిన అనంతరం సజ్జనార్ మీడియాతో మాట్లాడారు. గాయపడి, పోలీసులకు చిక్కిన దొంగ ఒమర్పై 25 కేసులతో పాటు రౌడీషీట్ ఉందని సీపీ తెలిపారు. దొంగలను పట్టుకునే క్రమంలో డీసీపీ చైతన్య రెండు రౌండ్లు కాల్పులు జరిపారని చెప్పారు.
సెల్ఫోన్ చోరీ చేసి పారిపోతున్న ఇద్దరు దొంగలను డీసీపీ చైతన్య, ఆయన గన్మ్యాన్ గమనించి పట్టుకునేందుకు ప్రయత్నించారు. దొంగలు.. గన్మ్యాన్పై కత్తితో దాడికి పాల్పడ్డారు. ఈక్రమంలో గన్ మ్యాన్, డీసీపీ చైతన్య కింద పడిపోయారు. వెంటనే తేరుకున్న డీసీపీ, గన్మెన్ దొంగలపై కాల్పులు జరిపారు. కాల్పుల్లో ఇద్దరు నిందితులు గాయపడ్డారు. నిందితుడు ఒమర్పై రెండు సార్లు పీడీ చట్టం కింద కేసులు నమోదయ్యాయి. 2016లో కామటిపురం పీఎస్లో నమోదైన పీడీ యాక్టు కేసులో ఏడాది జైల్లో ఉన్నాడు. 2020లో హుస్సేనీ ఆలమ్ పీఎస్లో పీడీ యాక్ట్ కేసులో ఏడాదిపాటు చంచల్గూడ జైల్లో ఉండి బయటకు వచ్చిన తర్వాత కూడా ఒమర్ ప్రవర్తన మారలేదు. ఆ తర్వాత కాలాపత్తర్ పీఎస్లో రెండు కేసులు నమోదయ్యాయి’’ అని సీపీ తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.