దివ్యాంగుల గృహాల కోసం అర్హుల జాబితా సిద్ధం చేయండి: జిల్లా కలెక్టర్

అక్షర ఉదయమ్ – గుంటూరు
జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు దివ్యాంగులకు గృహాల మంజూరుకు సంబంధించి అర్హుల జాబితాను వెంటనే సిద్ధం చేయాలని అధికారులకు ఆదేశించారు. ఆధార్ చిరునామా, జాబ్ కార్డు వంటి వివరాలను పూర్తిగా ధృవీకరించి మాత్రమే అర్హత నిర్ధారించాలన్నారు.
అధికారుల సమాచారం మేరకు ఇప్పటివరకు మొత్తం 91 దరఖాస్తులు అందగా, వాటిలో 72 మంది స్థానికులు, 19 మంది ఇతర జిల్లాలకు చెందినవారని తెలిపారు. అదనంగా మరో 12 దరఖాస్తులు కూడా వచ్చినట్లు వెల్లడించారు. ఈ దరఖాస్తులపై డిసెంబరు 11న సమగ్ర పరిశీలన జరపనున్నట్లు అధికారులు పేర్కొన్నారు.
పిఎం గ్రామీణ గృహాల మంజూరుకు జాబ్ కార్డు తప్పనిసరిగా ఉండాలని గృహ నిర్మాణ అధికారి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, ఆర్డీఓ తదితర అధికారులు పాల్గొన్నారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.