మొంథా తుఫాను… అప్రమత్తంగా ఉండాలి

అక్షర ఉదయమ్ – గుంటూరు
మొంథా తుఫాను ప్రభావం దృష్ట్యా అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఏ.తమీమ్ అన్సారియా గారు ఆదేశించారు. తుఫాను ఈ నెల 28వ తేదీ సాయంత్రం లేదా రాత్రికి కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని, గంటకు 90-100 కి.మీ. వేగంతో ఈదురు గాలులు వీయవచ్చని తెలిపారు.
లోతట్టు ప్రాంత ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించేందుకు, చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. వైద్య, విద్యుత్, నీటి, పౌర సరఫరాల శాఖలు, అగ్నిమాపక, విపత్తు నిర్వహణ, వ్యవసాయ శాఖలు తగిన సన్నద్ధతతో ఉండాలని ఆదేశించారు.

మున్సిపల్, మండల స్థాయిలో 24 గంటల కంట్రోల్ రూములు ఏర్పాటు చేయాలని, జిల్లా స్థాయిలో 0863-2234014 నంబరుతో కంట్రోల్ రూం పనిచేస్తుందని తెలిపారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.