దేశీయ ఫ్యూచర్ మార్కెట్ లో పసిడి ధర మంగళవారం ఆల్ టైమ్ గరిష్ఠానికి చేరింది

ఒక్క రోజులోనే 10 గ్రాముల గోల్డ్ ధర రూ.723 పెరిగి రూ.1,10,312 కు చేరింది. అంతర్జాతీయంగా నెలకొన్న అనిశ్చిత పరిస్థితులు, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లు తగ్గిస్తుందన్న అంచనాలు పసిడికి డిమాండ్ పెంచుతున్నాయి. డాలర్ ఇండెక్స్ బలహీనపడడం కూడా మరో కారణమని విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశీయ మల్టీ కమోడిటీ ఎక్స్ఛేంజీలో (MCX) డిసెంబర్ డెలివరీ గోల్డ్ ధర 10 గ్రాములు ఆల్టైమ్ గరిష్ఠమైన రూ.1,10,312కు చేరింది. అక్టోబర్ డెలివరీ బంగారం కూడా రూ.982 పెరిగి రూ.1,09,500 వద్ద ఆల్ టైమ్ గరిష్ఠాన్ని తాకింది. ఇక అంతర్జాతీయ ఫ్యూచర్ మార్కెట్ లోనూ డిసెంబర్ నెల డెలివరీ ఔన్సు బంగారం 3,698.02 డాలర్ల వద్ద రికార్డు స్థాయికి చేరింది. స్పాట్ గోల్డ్ ఔన్సు 3,658.38 డాలర్లు పలుకుతోంది. అంతర్జాతీయ ధరలను అనుసరించి దేశీయంగా మేలిమి బంగారం 10 గ్రాములు రూ.1,12,500 పైకి చేరింది.
– “అక్షర ఉదయమ్” న్యూస్
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..