రానున్న 48 గంటలలో మోస్తారు నుండి భారీ వర్షాలు: ప్రఖర్ జైన్

అక్షర ఉదయమ్ – అమరావతి
పశ్చిమమధ్య, ఆనుకుని ఉన్న వాయువ్య బంగాళాఖాతం, ఉత్తరాంధ్ర-దక్షిణ ఒడిశా తీరాల్లో అల్పపీడనం కొనసాగుతుందని, దీనికి అనుబంధంగా ఛత్తీస్గఢ్, విదర్భ మీదుగా దక్షిణ మహారాష్ట్ర వరకు ద్రోణి విస్తరించి ఉందని APSDMA ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.
వీటి ప్రభావంతో ఆదివారం శ్రీకాకుళం, కోనసీమ, తూర్పుగోదావరి,పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా, గుంటూరు, బాపట్ల, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో అక్కడక్కడ
పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. మిగతా జిల్లాల్లో కొన్నిచోట్ల తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు.
లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడరాదని సూచించారు.
శనివారం సాయంత్రం 5 గంటల నాటికి
తూర్పుగోదావరి జిల్లా తాళ్లపూడి, ఏలూరు జిల్లా లింగపాలెంలో 87. 2మిమీ,
గుంటూరు జిల్లా పెదకాకానిలో 77.2మిమీ,
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో 75మిమీ,
గుంటూరు జిల్లా వల్లభపురంలో 74మిమీ,
గుంటూరులో 72.2మిమీ,
నూజివీడులో 71మిమీ,
కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో 70.7మిమీ,
కౌతవరంలో 70.2మిమీ,
ప్రకాశం జిల్లా దర్శిలో 68.5మిమీ
చొప్పున భారీ వర్షపాతం, 47 ప్రాంతాల్లో 40మిమీకు పైగా వర్షపాతం రికార్డైందని ప్రఖర్ జైన్ వెల్లడించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..