మొబైల్ కిట్స్తో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట: రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రివర్యులు నాదెండ్ల మనోహర్

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం
పౌర సరఫరాల శాఖలో సంస్కరణలు తీసుకొస్తున్నామని మార్పు మొదలవుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. విశాఖలో పీడీఎస్ బియ్యాన్ని గుర్తించే ర్యాపిడ్ కిట్స్ను ఆయన ఆవిష్కరించి మాట్లాడారు. గతేడాది కాకినాడ
పోర్టులో బియ్యం అక్రమ రవాణాపై చర్యలు చేపట్టినట్లు తెలిపారు. కాకినాడ నుంచి రవాణా అయ్యే ప్రతి సరకును పరిశీలించి జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెప్పారు.

కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 5,65,000 క్వింటాళ్లు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. విశాఖ నుంచి పీడీఎస్ బియ్యం ఎగుమతులు జరగకుండా చర్యలు చేపట్టినట్లు చెప్పారు. నగరంలో 33 మంది సిబ్బందితో 3 చెకోపోస్టులు ఏర్పాటు చేశామన్నారు.

ఇతర రాష్ట్రాల నుంచి తరలివస్తున్న బియ్యాన్ని కూడా పూర్తిగా పరిశీలిస్తున్నాం. నిఘా విభాగం అధికారులు అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటాం. ఏపీలో 700 మొబైల్ కిట్స్ సిద్ధం చేశాం. అక్రమంగా ఎగుమతి చేసే పీడీఎస్ బియ్యాన్ని గుర్తించేందుకు ఇవి ఉపయోగపడతాయి. చెకో పోస్టుల వద్ద తనిఖీలు ముమ్మరం చేశాం.

ఈ ఏడాది నుంచి ప్రజలకు నాణ్యమైన బియ్యం అందిస్తాం. ఇప్పటికే స్మార్ట్ రైస్ కార్డులు, క్యూఆర్ కోడ్ జారీ చేశాం. దుకాణాలకు ఎంత బియ్యం తరలించాం పంపిణీ ఎంత అవుతుందనే వివరాలు సేకరిస్తున్నాం అని నాదెండ్ల మనోహర్ వివరించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.