ఆన్ లైన్ మనీ గేమ్స్ బ్యాన్

ఆన్ లైన్ మనీ గేమ్స్ బ్యాన్

 

ఆన్ లైన్ గేమింగ్ చట్టాన్ని త్వరలోనే అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ కార్యదర్శి ఎస్. కృష్ణన్ తెలిపారు. ఆగస్టు 21న ‘ది ప్రమోషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ ఆన్లైన్ గేమింగ్ బిల్లు-2025’ను పార్లమెంట్ ఆమోదించగా.. రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ చట్టం ప్రకారం అన్ని రకాల ఆన్ లైన్ మనీ గేమ్ ను నిషేధించారు.

ఈ చట్టం ప్రకారం ఆన్ లైన్ మనీ గేమ్స్ కు సంబంధించిన ప్రకటనలు నిషేధం. అలాంటి ప్రకటనలు చేస్తే రెండేళ్ల జైలు శిక్ష, రూ.50 లక్షల వరకు జరిమానా విధించే అవకాశం ఉంది. అలాగే మనీ గేమ్స్ కు సంబంధించిన ఆర్థిక లావాదేవీలను సులభతరం చేసే వారిపై మూడు సంవత్సరాల జైలు శిక్ష, రూ.1 కోటి వరకు జరిమానా విధించవచ్చు. పునరావృత నేరాలపై 3-5 సంవత్సరాల జైలు శిక్షతో పాటు రూ.2 కోట్ల వరకు జరిమానా విధించే నిబంధనలు ఉన్నాయి.

విదేశీ ఆధారిత ఆన్ లైన్ మనీ గేమింగ్, బెట్టింగ్ ప్లాట్ పామ్ ను అరికట్టడం ప్రభుత్వానికి పెద్ద సవాలుగా మారనుంది. అంచనా ప్రకారం దేశంలో సుమారు 45 కోట్ల మంది ఒకే ఏడాదిలోనే ఆన్ లైన్ మనీ గేమ్స్ కు బానిసై రూ.20 వేల కోట్ల మేర నష్టపోయినట్లు తెలుస్తోంది.

– “అక్షర ఉదయమ్” న్యూస్

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in