డిసెంబర్ 21న పల్స్ పోలియో కార్యక్రమం

అక్షర ఉదయమ్ – గుంటూరు
ఈ నెల 21వ తేదీన జిల్లాలో పల్స్ పోలియో కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ ఏ. తమీమ్ అన్సారియా గారు తెలిపారు. ఈ సందర్భంగా మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం కలెక్టర్ పల్స్ పోలియో ప్రచార పోస్టర్లను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఐదు సంవత్సరాల లోపు వయస్సు గల ప్రతి చిన్నారికి రెండు పల్స్ పోలియో చుక్కలు తప్పనిసరిగా వేయాలని సూచించారు. ఎవరి ఇళ్లూ మానిపోకుండా ప్రతి గ్రామం, వార్డు వరకు అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు జాగ్రత్తగా ముందస్తు ఏర్పాట్లు చేయాలని సూచించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.