భవానీ దీక్షల విరమణకు విజయవాడ సిద్ధం
- ఏర్పాట్లు పరిశీలించిన హోం మంత్రి అనిత

అక్షర ఉదయమ్ – విజయవాడ
విజయవాడ కనకదుర్గమ్మ ఆలయంలో ఈ నెల 11వ తేదీ నుంచి ప్రారంభమయ్యే భవానీ దీక్షల విరమణ కార్యక్రమానికి విస్తృత ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈసందర్భంగా హోం మంత్రి తానేటి వనిత అనిత మంగళవారం ఆలయాన్ని సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మంత్రితో పాటు ఆలయ అధికారులు, పోలీస్ ఉన్నతాధికారులు పాల్గొన్న ఈ సమావేశంలో భద్రతా ఏర్పాట్లు, వసతి సౌకర్యాలు, శానిటేషన్ పనులపై చర్చ జరిగింది. దీక్షల విరమణ సమయంలో 6 లక్షల మందికిపైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారన్న అంచనాల నేపథ్యంలో అన్ని విభాగాలతో సమన్వయం చేసుకుని భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని ఆమె ఆదేశించారు.

క్యూలైన్లలో భక్తులకు పాలు, మజ్జిగ పంపిణీ, ఆలయ పరిసరాల పరిశుభ్రత కోసం శానిటేషన్ సిబ్బందిని నియమించడం, ఘాట్ల వద్ద స్నానాల కోసం షవర్ సదుపాయాలు, భక్తులకు అందుబాటులో ఉంచేందుకు 60 లక్షల లడ్డూల ప్రసాదం సిద్ధం చేశారు.
భవానీ దీక్షల విరమణ సందర్భంగా డిసెంబరు 11 నుంచి 15 వరకు వీఐపీ, వీవీఐపీ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారని హోం మంత్రి తెలిపారు. కార్యక్రమం ప్రారంభానికి ముందు ఆమె దుర్గమ్మను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
Short News App: https://play.google.com/store/apps/details?id=com.aksharaudayam.app
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.