భారీగా పెరిగిన బంగారం ధరలు

అక్షర ఉదయమ్ – అమరావతి

 

బంగారం, వెండి ధరలు ఇవాళ మళ్లీ భారీగా పెరిగాయి. బులియన్ మార్కెట్లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధరపై రూ.950 పెరిగి రూ.79,050కి చేరింది. 24 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటుపై రూ.1,040 పెరగడంతో రూ.86,240 పలుకుతోంది. కేజీ వెండి ధరపై రూ. 1000 పెరిగి రూ.1,07,000కు చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని ప్రధాన నగరాల్లో ఈ ధరలు కొనసాగుతున్నాయి.