స్కేటింగ్ తో దేశ పర్యటన చేస్తున్న సోనూ

అక్షర ఉదయమ్ – విశాఖపట్నం

దేశమంతా ఒక్కటే అనే నినాదంతో ఏకతా భారత్ లక్ష్యంగా దేశమంతా స్కేటింగ్ చేస్తూ పర్యటిస్తున్నట్లు ప్రముఖ రోలర్ స్కేటర్ సోనూ సొరాసియం తెలిపారు. తాను స్కేటింగ్ ద్వారా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆధ్యాత్మిక నగరం కాశిలో బయలుదేరి జార్ఖండ్, ఒడిస్సా, ఆంధ్రా, తెలంగాణ, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, పంజాబ్ తదితర రాష్ట్రాల గుండా చివరకు మళ్ళీ కాశీ నగరానికి చేరి తాను చేస్తున్న యాత్రను ముగిస్తాను అని తెలిపారు.