ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి సాధించాలంటే రహదారుల పాత్ర ప్రధానమైనది
– కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి

అక్షర ఉదయమ్ – విజయవాడ
ఏ దేశమైనా ఆర్థికంగా ప్రగతి పథంలో పయనించాలంటే రహదారుల పాత్ర ఎంతో ప్రధానమైందని కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి అన్నారు. జాతీయ రహదారుల ప్రారంభం, శంఖుస్థాపన కార్యక్రమంలో భాగంగా మంగళగిరిలోని సీకే కన్వెన్షన్ సెంటర్లో శనివారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్బంగా కేంద్ర రోడ్డు రవాణా, హైవేల మంత్రి నితిన్ గడ్కరి మాట్లాడుతూ ముందుగా సభకు వచ్చిన వారికి అందరికి ధన్యవాదాలు అని తెలుగులో చెప్పిన సభికులను ఆశ్చర్య చకితులను చేశారు. దేశ ప్రగతిలో రహదారుల పాత్రను ప్రస్తావిస్తూ జాన్ ఎఫ్ కెనడీ రోడ్లు మూలంగానే అమెరికా రిచ్ అయ్యింది అన్నారని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సిఎం చంద్రబాబు, డిప్యూటీ సిఎం పవన్ కళ్యాణ్ లు ఏపీని అభివృద్ధిలో ముందుకు తీసుకుని వెళుతున్నారని, చంద్రబాబు తను సీఎంగా దేశానికి విజన్ చూపారని పేర్కొన్నారు. కన్నును దానం చెయ్యొచ్చు విజన్ ను చేయలేమని, భవిష్యత్తుపై అవగాహన ప్రతి ఒక్కరికి అవసరం, నాలెడ్జిని వెల్త్ గా మార్చేదే విజన్ అని వివరించారు. చంద్రబాబు డెవలప్మెంట్ విజన్ పట్ల ఆయనను అభినందించాలని అన్నారు. కొత్త టెక్నాలజీ దేశాన్ని మార్చుతుంది.
నేను షిప్పింగ్ మంత్రిగా ఉన్నప్పుడు నా వద్ద 9 వేల కోట్లు బడ్జెట్ ఉంటే 12 లక్షల కోట్లు పనులు చేశామని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి తెలిపారు. పోర్టు ఉన్న రాష్ట్రాలు వేగంగా అభివృద్ది చెందుతాయని, బస్సు, రైలు కన్నా జల మార్గంలో చాలా ఖర్చు తగ్గుతుందన్నారు. ఇండియాలో లాజిస్టిక్ కాస్ట్ 16 శాతం ఉంటే చైనాలో 8 శాతం అమెరికాలో 12 శాతం ఉందని, మనం 9 శాతం లాజిస్టిక్ కాస్టుకు వస్తే ఉద్యోగాలు వస్తాయి, ఎగుమతులు పెరుగుతాయని అన్నారు. ఆరు నెలలకు ముందు జపాన్ ను వెనెక్కి నెట్టి మనం ఆ స్ధానానికి ఎగ బాకామని ఇది శుభ సూచకమన్నారు. మన రైతులు కేవలం అన్నదాతే కాదు ఇంధన దాతలు అని, గతంలో ఇథనాల్ ను దేశీయ ఇంధనంలోకి తేవడం వల్ల ఎంతో ఖర్చు తగ్గిందని, ఇదంతా రైతులు వల్లే సాధ్యం అయ్యిందన్నారు. నేను ఏది చెపుతానో అది చేసి చూపూతా అందులో సందేహం లేదని పేర్కొన్నారు. ఇథనాల్ ను డీజిల్ లోనే కాదు ఎయిర్ ఫ్యూయల్ లో వినియోగించాలని ఆలోచన చేస్తున్నామన్నారు. నేను ఎలక్టిక్ కారును ప్రారంభించినప్పడు పాత్రికేయులు కారు ఆగిపోతే ఏం చేస్తారు అన్నారు మరి ఇప్పడు ఏకంగా ఎలక్ట్రికల్ బస్సులు కూడా వచ్చాయని అన్నారు. బ్యాటరీల తయారీలలో నూతన మార్గాలు వచ్చాయి అలాగే అయిదేళ్లలో బారత ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా ముందుకు వెళుతుందన్నారు. ఏపీలో గ్రీన్ హైడ్రోజన్ మిషన్ వస్తే రైతులకు లక్షల్లో ఆదాయం చేకూరే అవకాశం ఉందన్నారు. దేశ ఆర్ధిక వృద్ధిలో 22 శాతం వ్యవసాయం నుండి వస్తోందన్నారు. విజయవాడ – మచిలీపట్నం, వినుకొండ – గుంటూరు, కోటప్పకొండ – గుంటూరు – నారాకోడూరు, ముదునూరు – కడప, హైదరాబాబ్ – విజయవాడ 6 లేన్లు, హైదారాబాద్ నుండి విజయవాడకు గ్రీన్ ఎక్స్రెస్ హైవే వస్తుంది దానివ ల్ల ప్రయాణ సమయం 2 గంటలకు పైగా ఆదా అవుతుందన్నారు.
ఏపీలో లక్ష కోట్ల పనులు చేస్తాం, ఏపీలో రెండు నెలల్లోనే అమెరికాతో సమానంగా రోడ్లు తయారు అవుతాయని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరి హామీ ఇచ్చారు. నాగపూర్, జబల్పూర్ మధ్య పశు గ్రాసంను బిటమిన్ గా మార్చి కిలో మీటర్ రోడ్డు వేశామని అన్నారు. ఆ రహదారి పెట్రోలియం ప్రొడక్టుతో వేసిన రోడ్డు కంటే బెటర్ అని నిపుణులు తేల్చారని తెలిపారు. రోడ్లు బాగా వేయాలనే బాధ్యత ప్రధాని నాకు అప్పగించారన్నారు. నా వద్ద ఏపీకి సంబంధించి అతి పెద్ద లిస్టు ఉందని, వెబ్ సైట్లో వాటి వివరాలు (రోడ్లు ప్రాజెక్టు గురించి) ఉంచుతామని అన్నారు. రోడ్డు సేఫ్టీకి సంభందించి శంకర్ మహదేవన్ గీతాన్ని విన్నాం రోడ్డు ప్రమాదాలను తగ్గించడానికి ప్రయత్నిస్తున్నామన్నారు. ఏపీలో కూడా యాక్సిడెంట్ల సంఖ్య ఎక్కువగా నమోదు అవుతున్నాయని, ప్రతి జిల్లాలో వాటిని తగ్గించడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని సూచించారు. పోలవరంకు హెలికాప్టర్లో వెళ్లినప్పుడు ఎంతో నీరు సముద్రంలో కలిసి పోతుందని గుర్తించామని అన్నారు. గోదావరి నుండి కావేరి వరకూ నీటిని ఉపయోగించు కోవచ్చని, ఈ దేశంలో పుష్కలంగా నీరు ఉంది.. నీటి వినియోగం సరిగా లేదన్నారు.

అనంతరం 27 కొత్త ప్రాజెక్టులకు శంఖుస్ధాపనతో పాటు రెండు ప్రాజెక్టులను కేంద్రమంత్రి గడ్కరి, సిఎం, డిప్యూటీ సిఎంలు జాతికి అంకితం చేశారు.
కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడక ముందు రైతుల దగ్గరకి వెళ్లి ఇచ్చిన హమీని నేడు నిలబెట్టుకున్నామని అన్నారు. ఏపీ రాష్ట్ర అభివృద్ధికి మూలం అయిన రోడ్లు శంఖుస్థాపన చేయడం మరింత శుభ దినంగా పేర్కొన్నారు. ఏపీలో కూటమి ఎప్పుడు అధికారంలోకి వచ్చిందో నాటి నుండి ఈ రాష్ట్రానికి శుభ గడియలు వచ్చాయని అన్నారు. 2014లో 53 వేల కోట్లు బడ్జెట్ ఉంటే నేడు 6 లక్షల కోట్లు వరకూ ఈ శాఖ బడ్జెట్ ను గడ్కరి తీసుకు వెళ్ళారన్నారు. అయితే గత అయిదేళ్లలో రాజకీయ అసమర్ధత వల్ల రాష్ట్రం ఆ ఫలాలను పొందలేక పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరంకు కేంద్రం సాయంతో రూ. 12 వేల కోట్లకు పైగా కేటాయించారని, విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని పోరాటం చేసి రూ. 11 వేల కోట్లు తెచ్చి విశాఖ ఉక్కును నిలబెట్టారని, అమరావతి రైతులు విధ్వంసకర పాలనలో కూడా సుదీర్ఘ కాలం పోరాటం చేశారని గుర్తు చేసుకున్నారు. 28 ప్రాజెక్టులపై ఇప్పడే రివ్వూ అయ్యింది. వాటికి ఖర్చు రూ.80 వేల కోట్లు వాటికి గడ్కరి నో అనకుండా ఎస్ అని వాటిని ఎలా పూర్తి చేయాలో చెప్పారన్నారు. పాజిటివ్, ప్రోయాక్టివ్ , ప్రాక్టికల్, పీస్ ఫుల్ మినిష్టర్ నితిన్ గడ్కరి అని కొనియాడారు. తొలిసారి మంత్రిగా భాద్యతలు స్వీకరించిన తనకు గడ్కరీ పని తీరు మార్గదర్శిగా నిలిచిందన్నారు. గత పది సంవత్సరాల్లో ఏవియేషన్ చూసిన గ్రోత్ అమోఘమని అన్నారు. ఎయిర్ క్రాప్ట్ ల సంఖ్య కూడా డబుల్ అయ్యిందని, ఏపీని వాయు మార్గం, జల మార్గం, రోడ్డు మార్గాల ద్వారా గేట్ వే ఆఫ్ ఇండియాగా మార్చే ప్రయత్నం చంద్రబాబు చేస్తున్నారన్నారు.
కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ గడ్కరికి నాలుగు విషయాల్లో మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అన్నారు. రోజుకు 30 నుండి 40 కిలో మీటర్ల మేర జాతీయ రహదారులు నిర్మిస్తున్నారని, వైట్ కాంక్రిట్, రీసైకిల్ ప్లాస్టిక్ తో రోడ్లు నిర్మాణం మీ కృషి వల్లే జరిగిందన్నారు. రాజకీయాల్లోకి వస్తున్న మా లాంటి వారికి గడ్కరి ఆదర్శమని తెలిపారు. 140 మీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు అనుమతి ఇచ్చినందుకు ఈ ప్రాంతం తరపున ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు ఉన్నప్పుడు 160 కిలో మీటర్ల అవుటర్ రింగ్ రోడ్డుకు శంఖుస్ధాపన చేశారని, అలాగే 5000 ఎకరాలు సేకరణ చేసి అంతర్జీతీయ విమానాశ్రమం హైదరాబాద్ లో నిర్మింప చేశారని, హైదరాబాద్ లోని మెట్రో రైలుకు చంద్రబాబు నాయుడే శంఖుస్ధాపన చేశారని గుర్తు చేశారు. గత అయిదేళ్లు రాష్ట్రానికి ఎలాంటి పాలన అందించారో అందరూ చూశామన్నారు. చంద్రబాబు కొనసాగి ఉంటే ఈ పాటికి అమరావతి ముందుకు వెళ్లేదని ఈ ప్రాంతం అభివృద్ది అయ్యేదన్నారు.
కేంద్ర మంత్రి భూపతి రాజు శ్రీనివాస వర్మ మాట్లాడుతూ ఏపీలో నేడు కీలకమైన రోజని, .రైతుల ఖాతాల్లో నేరుగా అన్నదాత సుఖీభవ నగదు జమ అయిన రోజన్నారు. అర్హులైన ప్రతి ఒక్క రైతు ఖాతాల్లో 7 వేల రూపాయలు జమ చేశామన్నారు. దేశంలో జాతీయ రహదారులు పేరు చెపితే గుర్తుకు వచ్చేది నితిన్ గడ్కరి అని కేంద్రమంత్రిగా బాధ్యతలు చేపట్టాక జాతీయ రహదారుల రూపురేఖలను మార్చేశారన్నారు. రహదారులు విషయంలో కేంద్రంలో గడ్కరి, రాష్ట్రంలో చంద్రబాబు ఎంతో కృషి చేస్తున్నారన్నారు. 11 సంవత్సరాల్లో దేశంలో 48 వేల కిలోమీటర్ల జాతీయ రహదారి అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం గడ్కరినే అని కొనియాడారు. అమెరికా అభివృద్ధి చెందింది కాబట్టి ఆ రహదారులు బావుంటాయి అంటారు అయితే రహదారులు బాగుంటాయి కాబట్టే ఆదేశం అభివృద్ది చెందిందని గడ్కరి నాతో అన్నారని గుర్తు చేసుకున్నారు. అమరావతి రాజధాని కోసం 140 మీటర్ల రోడ్ల కోసం సీఎం చంద్రబాబు ప్రతిపాదన చేశారన్నారు.
రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు మడమ తిప్పకుండా ఇచ్చిన ప్రతీ హామీని అమలు చేస్తున్నారని అన్నారు. నాగరికతకు చిహ్నాలైన రహదారుల అభివృద్ధిపై ప్రధాని మోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టి సారించారన్నారు. జాతీయ రహదారుల అభివృద్ధి వల్ల రాష్ట్ర ముఖచిత్రం మారుతోందని తెలిపారు. అభివృద్ధికి పెద్ద పీట వేసే నాయకుడు ఓ వైపు ఉంటే.., రఫా రఫా భాషతో విద్వేషాలు రెచ్చగొట్టే నాయకుడు మరోవైపు ఉన్నాడని ఎద్దేవ చేశారు. యువతకు ఉపాధి అవకాశాలు కల్పించే నాయకత్వం ఓవైపు ఉంటే, యువతను చెడగొట్టి మంత్రుల్ని హత్య చేయిస్తాం అనే నాయకత్వం మరో వైపు ఉండటం దురదృష్టకరమని ఆవేధన వ్యక్తం చేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..