జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతా

జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతా
డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్

 


అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ

పల్నాడు ప్రాంతంలో జర్నలిస్టుల సంక్షేమం కోసం పాటు పడతానని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ చింతలపూడి అశోక్ కుమార్ అన్నారు. ఆదివారం పల్నాడు ఒయాసిస్ లో ఏర్పాటు చేసిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా చింతలపూడి అశోక్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టులు వృత్తి రీత్యా అనేక ఒడిదుడుకులు ఎదుర్కొంటారని, వారికి వైద్య పరంగానే కాకుండా, వారి సంక్షేమానికి తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పాత్రికేయులు అడిగిన పలు ప్రశ్నలకు ఆయన సమాధానం ఇచ్చారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని అభివృద్ధి చేయడమే తన ధ్యేయమని ఈ సందర్భంగా ఆయన చెప్పారు. పార్టీ అభివృద్ధికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని తెలిపారు. పార్టీ ఏ బాధ్యతలు అప్పగించినా తాను స్వీకరిస్తానని వెల్లడించారు. తాము నెలకొల్పిన చింతలపూడి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామని ఆయన తెలియజేశారు.

 

 

Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!

ఇప్పుడే డౌన్‌లోడ్ చేయండి –

PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..

www.aksharaudayam.in