పల్నాడు జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలకు జాగ్రత్తలు, సూచనలు చేసిన డాక్టర్ అశోక్ కుమార్ చింతలపూడి

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ
పల్నాడు ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గ్రామీణ ప్రాంతాల్లో జల ప్రళయం, రోడ్డు రవాణా అంతరాయం, నీటి నిల్వలు వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని, ప్రజలు, ముఖ్యంగా పిల్లలు, రైతులు, వృద్ధులు తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలని వైయస్సార్ సీపీ వైద్యుల విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి, పల్నాడు హాస్పిటల్స్ అధినేత, ప్రముఖ వైద్యులు చింతలపూడి అశోక్ కుమార్ సూచించారు.
పిల్లలు వరద నీరు, మురికి నీటి దగ్గర పిల్లలను వెళ్లనివ్వ వద్దని, పాఠశాలలకు పంపే ముందు వాతావరణాన్ని పరిశీలించి, సురక్షిత మార్గాలను మాత్రమే ఎంచుకోవాలి అని అన్నారు. తడిసిన దుస్తులతో ఎక్కువ సేపు ఉండనివ్వ కూడదని, అలా ఉంచితే జలుబు, వైరల్ జ్వరాలు వస్తాయని చెప్పారు.
అదే విధంగా రైతులు పొలాల్లోకి వెళ్ళే ముందు నీటి మట్టం, విద్యుత్ తీగలు పడివున్నాయా.. అనే విషయాన్ని తప్పక పరిశీలించాలని కోరారు. ఎరువులు, విత్తనాలు నీటి తడికి గురికాకుండా సురక్షిత ప్రదేశాల్లో భద్రపరచుకోవాలి అని సూచించారు. వరద నీటిలో పంటలను కాపాడటానికి తక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు.
వర్షాకాలంలో డెంగ్యూ, మలేరియా, వైరల్ జ్వరాలు ఎక్కువగా వ్యాప్తి చెందుతాయని, దోమలు పెరగకుండా చుట్టు పక్కల నీరు నిల్వ ఉండకుండా చర్యలు తీసుకోవాలని చెప్పారు. మరిగించిన లేదా శుద్ధి చేసిన నీటినే తాగాలని, జ్వరాలు, వాంతులు, విరేచనాలు, చర్మ వ్యాధులు వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి అని అన్నారు.
ప్రజల ప్రాణ భద్రత మనందరి మొదటి కర్తవ్యమని, ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నా, స్థానిక అధికారులు, వైద్య శాఖ, విపత్తు నిర్వహణ విభాగానికి వెంటనే సమాచారం ఇవ్వాలని చింతలపూడి అశోక్ కుమార్ విజ్ఞప్తి చేశారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..