ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా
అక్షర ఉదయమ్ – హైదరాబాద్
ఔటర్ రింగ్ రోడ్డు దగ్గర న్యూ గో ట్రావెల్స్ బస్సు బోల్తా పడింది. ఈ దుర్ఘటనలో మియాపూర్ నుంచి గుంటూరు వెళ్తున్న బస్సు తిరగబడింది. బస్సు నంబర్ AP 39 UP1963 రంగారెడ్డి జిల్లా పెద్ద ఔటర్ రింగ్ రోడ్డు బోల్తా పడింది. 20 మంది ప్రయాణికులతో మియా పూర్ నుంచి బయలుదేరిన బస్సుగా పోలీసులు గుర్తించారు. పఠాన్ చెరువు దగ్గర ఔటర్ ఎక్కి పెద్దఅంబర్ పేట్ దగ్గర దిగుతున్న సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
పోలీసులు, స్థానికులు, ఔటర్ సిబ్బంది సహాయక చర్యల్లో భాగమై క్షతగాత్రులను అంబులెన్స్లో ఆసుపత్రికి తరలించారు. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళుతున్న బస్సు కర్నూలు జిల్లాలో అగ్ని ప్రమాదానికి గురై 19 మంది చనిపోయిన ఘటన జరిగిన 24 గంటల్లో వ్యవధిలోనే ఇలా జరగడంతో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల్లో టికెట్ బుక్ చేసుకోవాలంటేనే ప్రయాణికులు బెంబేలెత్తిపోతున్నారు.
పోలీసులు క్రేన్ సహాయంతో ప్రమాదంకి గురైన ఎలెక్ట్రిక్ బస్సును తొలగించారు.
Stay Updated with Every Breaking News
– Download Akshara Udayam App Now!
ఇప్పుడే డౌన్లోడ్ చేయండి –
PlayStore https://play.google.com/store/apps/details?id=com.akshara.newsapp లో అందుబాటులో ఉంది.
“అక్షర ఉదయమ్ – తెలుగోడి గళం — అవినీతి పై సమరం”, ప్రజల గొంతు, ప్రజల న్యూస్..
ఈ-పేపర్ కోసం www.epaper.aksharaudayam.in నీ సందర్శించండి.