
అక్షర ఉదయమ్ – ఏలూరు
ఏలూరులోని చోడిమెల్లు గ్రామం సమీపంలో ప్రైవేట్ ట్రావెల్ బస్సు లారీని ఢీకొని బోల్తా పడటంతో ముగ్గురు మరణించగా, 20 మంది గాయపడ్డారు. గురువారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగిందని అధికారులు తెలిపారు.
హైదరాబాద్ నుండి కాకినాడకు వెళ్తున్న బస్సు అతివేగం కారణంగా నియంత్రణ కోల్పోయి సిమెంట్ లోడుతో వెళ్తున్న లారీని ఢీకొట్టిందని సమాచారం.
ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు ప్రయాణికులు అక్కడికక్కడే మరణించగా, మిగిలిన వారు గాయాల పాలయ్యారు.
గాయపడిన వారిని వైద్య చికిత్స కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. వారిలో బస్సు డ్రైవర్ పరిస్థితి విషమంగా ఉంది.

ఈ సంఘటన పై ఏలూరు రూరల్ పోలీసులు మాట్లాడుతూ ఏలూరులోని చోడిమెల్లు గ్రామం సమీపంలో ప్రైవేట్ బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు వ్యక్తులు మరణించగా, 20 మంది గాయపడ్డారు. బస్సు హైదరాబాద్ నుండి కాకినాడకు వెళుతోంది.
ప్రమాదానికి గల కారణాల పై అధికారులు దర్యాప్తు ప్రారంభించారు, ప్రాథమిక పరిశోధనల ప్రకారం అతివేగమే ప్రధాన కారణమని తేలింది. మరణించిన ప్రయాణికులను గుర్తించాల్సి ఉందని తెలిపారు.