ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం….
అక్షర ఉదయమ్ – అమరావతి:
ఏపీ శకటానికి కేంద్ర ప్రభుత్వ పురస్కారం లభించింది. 30 సంవత్సరాల తర్వాత రాష్ట్రానికి బహుమతి దక్కింది. రిపబ్లిక్డే పెరేడ్లో యావత్ దేశాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శకటం ఆకట్టుకుంది.
ఏటికొప్పాక బొమ్మల రాజసానికి నెటిజన్లు ఫిదా అయిపోయారు. ఏటికొప్పాక బొమ్మల శకటానికి కేంద్రం జ్యూరీ అవార్డు ప్రకటించింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు అభినందనలు తెలిపారు.
