అక్షర ఉదయమ్ – అద్దంకి

బల్లికురవ పోలీసు స్టేషన్ పరిధిలో ఇటీవల మద్యం దుకాణంలో దొంగలు చొరబడి మద్యం సీసాలను, డబ్బును దొంగలించిన నేపథ్యంలో శనివారం చీరాల డిఎస్పి మహమ్మద్ మెయిన్ నేతృత్వంలో పోలీసులు సింగరకొండ వద్ద నిందితులను పట్టుకున్నారు. డిఎస్పీ మాట్లాడుతూ మొత్తం ఏడుగురు ముద్దాయిలు చోరీకి పాల్పడినట్లు చెప్పారు. వారందరూ వినుకొండకు చెందిన వారిని డీఎస్పీ పేర్కొన్నారు. 337 మద్యం సేసాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు.