తిరుమలలో అదనపు ఈవో ఆకస్మిక తనిఖీలు

తిరుమలలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా లడ్డూ కౌంటర్లు, అగర్బత్తీల స్టాల్స్‌ను సందర్శించి విక్రయాలను పరిశీలించారు. అనంతరం బూందీ పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.

అక్షర ఉదయమ్ – తిరుమల