
తిరుమలలో అదనపు ఈవో శ్రీ సిహెచ్ వెంకయ్య చౌదరి శనివారం సాయంత్రం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఇందులో భాగంగా లడ్డూ కౌంటర్లు, అగర్బత్తీల స్టాల్స్ను సందర్శించి విక్రయాలను పరిశీలించారు. అనంతరం బూందీ పోటును పరిశీలించి పలు సూచనలు చేశారు.

ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో శ్రీ లోకనాథం తదితరులు పాల్గొన్నారు.
అక్షర ఉదయమ్ – తిరుమల