ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు శంఖుస్థాపన

ఇంటింటికి కుళాయిల ఏర్పాటుకు శంఖుస్థాపన

 

అక్షర ఉదయమ్ – గురజాల

పల్నాడు జిల్లా గురజాల మండలం దైద గ్రామంలో “జల్ జీవన్ మిషన్” నిధులతో ఆంధ్రప్రదేశ్ గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య శాఖ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ప్రాంతానికి త్రాగు నీరు సరఫరా ప్రాజెక్ట్ రూ.1200 కోట్ల రూపాయలు అంచనాల్లో భాగంగా రూ. 2 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న 1,50,000 లీటర్ల సామర్ధ్యం వున్న ఓవర్ హెడ్ సర్వీస్ రిజర్వాయర్ వాటర్ ట్యాంక్ నిర్మాణం, పైప్ లైన్లు, ఇంటింటికి కుళాయిల ఏర్పాటు శంఖుస్థాపన కార్యక్రమంలో గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు, గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, గురజాల నియోజక వర్గ పార్టీ పరిశీలకులు కల్లం రాజశేఖరరెడ్డి, గురజాల మండల తహసీల్దార్ నెమలిపురి దుర్గేశ్వరరావు, ఆర్.డబ్ల్యూ.ఎస్. డిఈ వెంకటేశ్వర్లు, ఆర్.డబ్ల్యూ.ఎస్. ఏఈ సురేష్ తదితరులు శంఖుస్థాపన చేశారు.