మళ్లీ పెరిగిన బంగారం ధరలు

బంగారం ధరలు పసిడి ప్రియులకు మరోసారి షాక్ ఇచ్చాయి. వరసగా నాలుగో రోజు బంగారం ధరలు పెరిగాయి. హైదరాబాద్లో ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడిపై రూ. 600 పెరిగి రూ.99,600కు చేరింది. ఇక 22 క్యారెట్ల పుత్తడి 10గ్రాములకు రూ.550 పెరిగి రూ.91,300 వద్ద కొనసాగుతోంది. అటు కిలో వెండిపై కూడా రూ. 100 పెరిగి రూ.1,11,100గా ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు కొనసాగుతున్నాయి.