సీఎం చంద్రబాబు నాయుడు పైతీవ్ర పదజాలంతో అంబటి వ్యాఖ్యలు
అక్షర ఉదయమ్ – గుంటూరు
వైసీపీ నేత అంబటి రాంబాబు శనివారం గుంటూరులోని చిల్లీస్ హోటల్ సమీపానికి చేరుకోవడంతో రాజకీయ ఉద్రిక్తత నెలకొంది. ఆయన రాకకు నిరసనగా కూటమి నేతలు భారీగా అక్కడికి చేరి అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇరువర్గాల మధ్య వాగ్వాదం పెరగడంతో పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. ఈ సందర్భంగా అంబటిరాంబాబు తీవ్ర పదజాలంతో వ్యాఖ్యలు చేయడంతో ఉద్రిక్తత మరింత పెరిగింది. పోలీసులు పరిస్థితిని అదుపు చేస్తున్నారు.