హోం మంత్రి అనిత సమీక్షా సమావేశం
– డీజీపీ కార్యాలయంలో పోలీస్ విభాగం పరిస్థితులపై సమీక్ష

అక్షర ఉదయమ్ – అమరావతి
డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, ఇతర ఉన్నత పోలీసు అధికారులు పాల్గొన్నారు. ఇటీవలి కాలంలో జరిగిన పోలీసు నియామకాలు, అప్పా గ్రేహౌండ్స్ ఏర్పాటు, పెండింగ్ బిల్లుల అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమీక్ష అనంతరం, హోం మంత్రి టెక్ టవర్ను సందర్శించారు. అక్కడ శక్తి టీమ్ కాల్ సెంటర్ను పరిశీలించి, వారి సేవలపై సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళల భద్రత కోసం శక్తి టీమ్ చేస్తున్న సేవలను మంత్రి అభినందించారు.