
అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి వారి రథోత్సవ తిరునాళ్ళ సందర్భంగా దేవాలయ ప్రాంగణంలో సీతారాముల కళ్యాణ మహోత్సవం ఎంతో వైభవంగా జరిగింది. ఈ కళ్యాణ మహోత్సవంలో దేవాలయ అధ్యక్షులు కాకుమాను కుటుంబం, పెరుమాళ్ళ రాజేష్ దంపతులు కళ్యాణంలో కూర్చొని స్వామి వారి సీతారాముల కళ్యాణం ఘనంగా జరిపించారు. ఈ కళ్యాణ మహోత్సవంలో దేవాలయ కమిటీ సభ్యులు దంపతులుగా కూర్చొని, స్వామి వారి కళ్యాణం జరిపిస్తూ ఏర్పాట్లు దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు. సీతారాముల కళ్యాణం చూడడానికి పట్టణంలోని భక్తులు అధిక సంఖ్యలో వచ్చి స్వామి వారి కళ్యాణం తిలకించి పరవశించారు.