తిరుమలలో పోలీసులతో పాటు విజిలెన్స్ అధికారులు నాన్ లోకల్ హ్యాకర్లు పై దాడులు

అక్షర ఉదయమ్ – తిరుమల

తిరుపతి జిల్లా ఎస్పీ శ్రీ వి హర్షవర్ధన్ రాజు ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు తిరుమలలో పోలీసులతో పాటు విజిలెన్స్ అధికారులు సంయుక్తంగా నాన్ లోకల్ హ్యాకర్లు పై దాడులు.

పవిత్రమైన తిరుమల క్షేత్రంలో శాంతి భద్రతలు కాపాడటంతో పాటు నేరాల నియంత్రణ, విజిబుల్ పోలీసింగ్ లో భాగంగా తిరుమలలో పోలీసులు మరియు విజిలెన్స్ వారితో కలసి టూ టౌన్ సీఐ శ్రీరాములు గారు తనిఖీలు నిర్వహించినారు.

తిరుమలలో భక్తులతో రద్దీగా ఉండే ప్రదేశాలైన నందకం గెస్ట్ హౌస్, వకుళమాత గెస్ట్ హౌస్, వరాహస్వామి గెస్ట్ హౌస్ ఏరియాలలో ఉన్న 25 మంది ఎలాంటి సర్టిఫికెట్స్ ఆధారాలు లేకుండా వ్యాపారాలు చేస్తున్నారు.

నాన్ లోకల్ హ్యాకర్లును అనుమానితులను గుర్తించడం జరిగింది.

నాన్ లోకల్ హ్యాకర్లు యొక్క నేర చరిత్ర గుర్తించేందుకు ఫింగర్ ప్రింట్స్, ఆధార్ డేటాను తనిఖీలు చేశారు.

ఎలాంటి నేరా చరిత్రలు లేకపోవడంతో వాళ్ళందరినీ తిరుమల నుండి పంపించడం జరిగింది.

తిరుమలలో ప్రశాంతమైన వాతావరణంలో హ్యాకర్లు వ్యాపారాలు చేసుకొవాలి.

అనుమతి లేకుండా ఎవ్వరూ కూడా తిరుమలలో వ్యాపారాలు చేయకూడదు, అలా చేయడం నేరం.

హ్యాకర్లు పోలీస్ నిబంధనలకు విరుద్దంగా వ్యవహరిస్తే అలాంటి వారి పై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటాం.

దేశ విదేశాల నుండి తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకునేందుకు భక్తులు వస్తూ ఉంటారు.

ఇతర ప్రాంతాల నుండి వస్తున్న భక్తులకు ఎవరు ఇబ్బంది కలిగించిన కఠిన చర్యలు తప్పవు.

నాన్ లోకల్ హాకర్స్ కు పోలీసులు ఎవరు అనుకూలంగా వ్యవహరించిన అలాంటి వారి పైన కూడా చర్యలు తప్పవని హెచ్చరించిన ఎస్పీగారు.

ఈ కార్యక్రమంలో పోలీస్ మరియు విజిలెన్స్ సిబ్బంది పాల్గొన్నారు.