మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం: మంత్రి నాదెండ్ల

అక్షర ఉదయమ్ – ఏలూరు

మహిళల ఆర్థికాభివృద్ధి, భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇస్తాం.

మహిళలు అత్యవసర పరిస్థితిలో 181 టోల్ ఫ్రీ సేవలు వినియోగించుకోవాలి.

మహిళల భద్రతకు సంబంధించి శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదు. మీ వెంటే మేముంటాం అంటూ మంత్రి నాదెండ్ల భరోసా

వచ్చే ఆర్ధిక సంవత్సరం నుండి రాష్ట్రంలో కోటి మందికి పైగా మహిళలకు దీపం-2 పధకం కింద ఉచిత గ్యాస్ కనెక్షన్లు ఇస్తాం. ఇప్పటికే 96.40 లక్షల మంది మహిళలకు ఉచిత గ్యాస్ అందిస్తున్నాం.

ప్రభుత్వ పాఠశాలలు, వసతి గృహాలలో నాణ్యమైన బియ్యంతో మధ్యాహ్న భోజన పధకం అమలు.

మహిళలకు ఉచితంగా కేన్సర్ స్క్రీనింగ్.

పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోయే మహిళల అక్రమ రవాణా నిరోధక బిల్లుకు పూర్తిగా మద్దత్తిస్తాం.

రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేయడంతో పాటు మహిళలలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దేలా ప్రత్యేక ప్రణాళిక – మంత్రి నాదెండ్ల మనోహర్.