రేపు రథోత్సవంలో పాల్గొననున్న యరపతినేని నిఖిల్

📰 Generate e-Paper Clip

అక్షర ఉదయమ్ – పిడుగురాళ్ళ: గురజాల శాసన సభ్యులు యరపతినేని శ్రీనివాసరావు తనయుడు, తెలుగుదేశం పార్టీ యువ నాయకులు యరపతినేని నిఖిల్ మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు పల్నాడు జిల్లా పిడుగురాళ్ళ పట్టణంలోని ప్రజాశక్తి నగర్ లో కొలువైయున్న సువర్చల సమేత ప్రసన్నాంజనేయ స్వామి వారి రథోత్సవం, కళ్యాణోత్సవం, 18వ వార్షికోత్సవం సందర్భంగా నిర్వహించే పూజా కార్యక్రమాల్లో పాల్గొంటారు. అనంతరం ప్రసన్నాంజనేయ స్వామి దేవాలయం నుండి ఆంధ్రా బ్యాంక్ సెంటర్ వరకు నిర్వహించే రథోత్సవం ఊరేగింపు కార్యక్రమంలో పాల్గొంటారు.